రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
మెదక్ ఎస్పీ డా. బాలస్వామి
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తాజాగా 23 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వి.వి. శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
• మెదక్ ఎస్పీగా బాలస్వామి
• కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్
• మహిళా భద్రత విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి
• రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
• హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్.వెంకటేశ్వర్లు
• రామగుండం సీపీగా ఎల్. ఎస్. చౌహాన్
• ఎల్బీనగర్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్కుమార్
• టీఎస్ ట్రాన్స్కో ఎస్పీగా డి.ఉదయ్కుమార్ రెడ్డి
• మాదాపూర్ డీసీపీగా జి. వినీత్



