Sunday, September 8, 2024

ఐటీ సోదాల్లో 42 కోట్లు…

- Advertisement -

హైదరాబాద్ అక్టోబరు 13:  బెంగళూరు సుల్తాన్‌పాళ్యం ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన సోదాల్లో 40 కోట్లకు పైగా నగదును గుర్తించారు. కాంట్రాక్టర్ R అంబికాపతి, ఆయన భార్య-మాజీ కార్పొరేటర్ అశ్వతమ్మలను ఈ డబ్బులపై ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు నిధులు మంజూరు చేస్తున్నారనే అనుమానంతో కాంట్రాక్టర్లు, జ్యువెలరీ షాపు యజమానులు, మాజీ, ప్రస్తుత కార్పొరేటర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో మాజీ కార్పొరేటర్ బంధువు ఫ్లాట్‌లో రూ.42 కోట్ల నగదు దొరికినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఆర్టీనగర్‌లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్‌లో సోఫా కింద నగదు లభ్యమైనట్లు ఐటీ వర్గాలు తెలిపాయి.మాజీ కార్పొరేటర్ బంధువు, మాజీ మహిళా కార్పొరేటర్ బంధువు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాజీ మహిళా కార్పొరేటర్ భర్త కూడా కాంట్రాక్టర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ కాగా, ఆమె సోదరుడికి చెందిన ఫ్లాట్ కు ప్రస్తుతం ఆర్థికసాయం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్ర ఎన్నికలకు ఖర్చు చేసేందుకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం అందగా.. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలీసు సిబ్బంది భద్రతతో వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.ఫ్లాట్‌లో దొరికిన రూ.42 కోట్లకు సంబంధించి మాజీ కార్పొరేటర్ సోదరుడిని ఆదాయపన్ను శాఖ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. మరోవైపు మాజీ కార్పొరేటర్‌కు సంబంధించిన వ్యాపార, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అతను కాంట్రాక్టర్, అతని కార్యాలయం మరియు వ్యాపారంలో ఐదుకు పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల బృందం ఫుటేజీతో పాటు లెక్కింపుతో రూ.42 కోట్లను స్వాధీనం చేసుకుంది.కర్ణాటకలో అదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఏక కాలంలో 12 చోట్ల ఈ దాడులు కొనసాగించారు. కర్ణాటకకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు జరిగాయి. మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. కాంట్రాక్టర్ల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంబికానాథ్ నివాసంతో పాటు పలువురు కాంట్రాక్టర్ల నివాసాలపై దాడ చేసి తనిఖీలు నిర్వహించారు.

42-crores-in-it-searches
42-crores-in-it-searches

డబ్బంతా తెలంగాణకు తరలించేందుకు స్కెచ్

అంబికానాథ్ నివాసంలో నుండి 20 అట్టపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సుమారు 42 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఐటీఅధికారులు గుర్తించారు..ఇలా మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్ల నివాసాల నుండి ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము అంతా అంబికానాథ్ ‌కు చెందిన ఒక ఫ్లాట్‌లో దాచినట్లు గుర్తించారు. ఈ ఫ్లాట్ తాళం చెవి ఐటీ అధికారులకు ఇచ్చేందుకు మొదట అంబికానాథ్ నిరాకరించాడు. ఎట్టకేల ఆ ఫ్లాట్ తెరిచిన అధికారులు నోట్ల కట్టలు ఉన్న పెట్టెలను చూసి షాక్ అయ్యారు.కర్ణాటకలో పట్టుబడిన ఈ డబ్బంతా తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేసినట్లు విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు 25 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని కర్ణాటక భారతీయ జనతా పార్టీ నేత మునిరత్న ఆరోపించారు. గతంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంబికానాథ్ ఇంటిపై ఇప్పుడు ఐటీ సోదాలు జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చేందుకు 40 శాతం కమిషన్ ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ.. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. అయితే కాంట్రాక్టర్ల ఆరోపణలపై అప్పటి బీజేపీ మంత్రి మునిరత్న డిఫర్మేషన్ కేసు దాఖలు చేశారు. ఆ కేసులో అంబికానాథ్ ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్‌పై విడుదల అయ్యారు.తాజాగా అక్టోబర్ 13న ఉదయం నుండి కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పట్టుబడుతున్న డబ్బు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు చేసిన ఏర్పాట్లేనని కర్ణాటక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ డబ్బులు పంచాలని కాంగ్రెస్ భావించిందనీ, నవంబర్ 9 లోపు 100 కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించారనుకుంటున్నారని కర్ణాటక బీజేపీ నేత మునిరత్న ఆరోపించారు. ఒక మీటింగ్ దృష్ట్యా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన, ఐటీ సోదాలపై ఈ విధంగా స్పందించారు.

తెలంగాణలో డబ్బులు పంచి కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది -హరీష్ రావు

మరోవైపు ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. బెంగళూరు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ డబ్బులు బయటపడ్డాయని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో డబ్బులు పంచి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని హరీష్ విరుచుకుపడ్డారు. గతంలో కర్ణాటకలో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉందన్న ఆయన.. ప్రస్తుతం 50 శాతం కమిషన్ నడుస్తుందని ఆరోపించారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు డబ్బులు తరలిస్తున్నారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్