- Advertisement -
తెలంగాణలో పిడుగులు పడి 8 మంది రైతుల మృతి
Sep 11, 2025,
8 farmers killed in lightning strike in Telangana
తెలంగాణలో పిడుగులు పడి 8 మంది రైతుల మృతి
తెలంగాణలో బుధవారం పిడుగులతో కురిసిన వర్షం విషాదాన్ని మిగిల్చింది. మూడు జిల్లాల్లో ఎనిమిది మంది రైతులు మృతి చెందారు. నిర్మల్లో ముగ్గురు, జోగులాంబ గద్వాలలో ముగ్గురు, ఖమ్మంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోనూ తక్కువసేపే అయినా భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలను తేలికగా తీసుకోవద్దని, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
- Advertisement -



