
విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోటీలు ఘనంగా ప్రారంభమ య్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు టీములు ఈ పోటీలలో తలప డనున్నాయి. భారత్ క్రికెట్ జట్టులో ఆడుతున్న భరత్, విహారి వంటి ప్లేయర్లు ఈ మ్యాచ్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నా థ్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికె ట్ మ్యాచ్లలో స్థానం సంపాదించి రా ష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. సీజన్-1 మంచి ఫలితాలు ఇచ్చిందని, ఇందులో పలువురు క్రీడాకారులు ఐపీ ఎల్లో స్థానం దక్కించుకున్నార న్నారు. ఏపీఎల్- 2 – వైజాగ్ వేదికగా ఈ నెల 27వ తేదీ వరకు టోర్నీ-యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకే ఏపీఎల్-ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రా రెడ్డి వివరించారు. సినీ హీరోయి న్ లీల గౌరవ అతిథిగా హాజరై క్రీడాకా రుల్లో ఉత్సాహాన్ని నింపారు.



