రఘుపతి వెంకయ్య నాయుడు శిలాఫలకాన్ని ధ్వంసం

జూబ్లీహిల్స్ ఫిలింనగర్ ఫిలిం ఛాంబర్ చౌరస్తాలో ఉన్నటువంటి సినీ పితామహుడు స్వర్గీయ రఘుపతి వెంకయ్య నాయుడు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిలిం ఛాంబర్ కార్యదర్శిని కలిసి ఈ యొక్క విగ్రహ శిలాఫలకం ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించి మరియు ఆ శిలాఫలకం పై ఉన్నటువంటి తప్పులను సరిచేసి తొందరలో ఆ శిలాఫలకాన్ని పునర్ నిర్మించవలసిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా ఆ యొక్క శిలాఫలకంపై రఘుపతి వెంకయ్య అని మాత్రమే ఉంది మేము దానిని రఘుపతి వెంకయ్య నాయుడు అని మార్చవలసిందిగా విన్నవించాం. సరి చేస్తాను అని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమం తిక్కిరెడ్డి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చందానగర్ కాపు సంఘం అధ్యక్షులు శ్రీ మిర్యాల ప్రీతం , అమీన్పూర్ కాపు సంఘం అధ్యక్షులు రవణం ప్రసాద్ , త్రినాధ్ వెంకటేశ్వరరావు చలo , జవ్వాది సత్యనారాయణ, మోతీ నగర్ నుండి ఆనంద్ , నిజాంపేట నుండి మల్లేశ్వరరావు , బోరబండ నుండి శ్రీ రాధాకృష్ణ వారి మిత్ర బృందం పాల్గొన్నారు.




