
అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే
* గులాబీ శ్రేణులతో భారీ ర్యాలీ *
* కోలాహలంగా మారిన సందోహం *
భారత రాష్ట్ర సమితి మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమోతు భాస్కరరావు నామినేషన్ వేసే ముందుగా స్థానిక ఎన్ఎస్పి క్యాంపు గల అమరవీరుల స్థూపం వద్ద గురువారం ఘనంగా నివారపించారు. స్థూపానికి వివిధ రకాల పూలాలతో ప్రత్యేకంగా అలంకరించారు పలువురు కార్యకర్తలు స్వచ్ఛందంగా స్తూపం వద్దకు చేరుకున్నారు అమరవీరులకి జోహార్ల అర్పించారు. డప్పు వాయిద్యాలు, మహిళలకు కోలాట బృందాలతో పరిసరాలననీ కొలహలంగా మారాయి దారి పడుగున కిక్కరించిపోయింది. స్థూపం వద్ద నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సాగర్ రోడ్ మీదుగా రాజీవ్ చౌక్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు గులాబీ శ్రేణులు భారీగా కదిలారు. దారి పొడవునా వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఎమ్మెల్యే భాస్కరరావుకు పూల వర్షం కురిపించారు ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహపడ్డారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో పాటు వేములపల్లి, దామరచర్ల, మాగులపల్లి, అడవిదేవులపల్లి, మండలాల నుంచి టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు



