- Advertisement -
మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ నిందితుడు అసీమ్ దాస్ తండ్రి సుశీల్ దాస్(62 ) ఆత్మహత్య చేసుకున్నారు.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లా లోని అచ్చోటి గ్రామంలో సుశీల్దాస్ ఉరివేసుకొని చనిపోయారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ కి మహదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ నిందితుడు అసిమ్ దాస్ 508 కోట్లు ఇచ్చినట్లు ఈడి కి మొదట వాంగ్మూలం ఇచ్చారు. కానీ అసిమ్ దాస్ మళ్లీ తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నాడు. సీఎంకు తను డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు.
ఈ బెట్టింగ్ ఆరోపణలు వలన మొన్న జరిగిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భూపేష్ బగేల్ పార్టీ పరాజయం పాలు అయింది.
- Advertisement -



