- Advertisement -
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సలహాదారులుగా నియమితులైన సోమేష్ కుమార్, రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, జీఆర్ రెడ్డి, ఆర్ శోభ నియామకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -



