ఘనచరిత్ర కలిగిన భాగ్యనగర గడ్డపై రొక్కం సుభాష్, రొక్కం సంధ్య దంపతుల పుణ్యాల ప్రోవుగా పుట్టి




2018 లో రుషిత తన నాలుగవ ఏటనుంచే శ్రీమతి చల్లా హిమబిందు గారి దగ్గర తన నాట్యకళని ప్రారంభించి గౌతమ్ మోడల్ స్కూల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ టీచర్స్ మీటింగులో తన ప్రతిభను కనపర్చి అందరి మన్ననలు పొందినది..తరువాత రవీంద్రభారతిలో తెలంగాణా మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ వారి పదవ వార్షికోత్సవంలో పాల్గొని అందరి ప్రశంసలు పొందింది.. అలాగే రైస్ ఫౌండేషన్, అల్ ఇండియా చిరంజీవి యువత, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు, ఆంధ్ర ప్రదేశ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన అనేక కార్యక్రమాలలో తన ప్రదర్సనలు ఇచ్చి అందరి అభిమాన పాత్రురాలైంది రుషిత. ప్రస్తుతం హైదరాబాద్ లోని విజ్ఞానజ్యోతి పబ్లిక్ స్కూలులో నాలుగవ తరగతి చదువుతున్న బేబి రుషిత చత్తీస్ ఘడ్ లోని ప్రాచీన కళా కేంద్ర యూనివర్సిటీ వారు నిర్వహించే భూషణ్ వన్ అనే పరీక్షకు సర్వం సిద్ధం అవుతోంది..



