- Advertisement -
జామ్ గ్రామంలో ప్రజా పాలన ను పరిశీఇంచిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల ధరఖాస్తుల స్వీకార కార్యక్రమం లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అభయహస్తం ధరఖాస్తులు అర్హులైన ప్రజలందరూ చేసుకావాలని సూచించారు. నిర్మల్ నియోజక వర్గంలో పేద ప్రజలందరికీ ప్రతీ సంక్షేమ పథకం అందేలా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని, ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల సాకుతో ఇచ్చిన హామీలను పక్కన పెడితే సహించబోమని అన్నారు.
- Advertisement -



