ఆన్ లైన్ పేరుతో అడుగడుగునా మోసం.! వేల రూపాయలు బురిడీ.
ఐజీఎస్ డిజిటల్ సర్వీస్ పేరు ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
డిజిటల్ సేవలు అందిస్తామని ఆన్లైన్ లో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
రైల్వే, విమాన సహా 300 రకాల సేవలు అందిస్తామని, ఐడి రిజిస్ట్రేషన్ కోసం తొలుత ఒక వెయ్యి 800 రూపాయలు వసూలు చేస్తున్నారు నేరగాళ్లు.
తర్వాత కేవైసి సహా పలు రకాల పేర్లతో వేల రూపాయలు కాజేస్తున్నారు.
రాజస్థాన్ జైపూర్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఐజీఎస్ డిజిటల్ సెంటర్ లిమిటెడ్ సంస్థ.. బేగంపేట వైట్ హౌస్ భవనంలో కాల్సెంటర్ నిర్వహిస్తోంది.
బాధితుడి ఫిర్యాదుతో కాల్ సెంటర్ పై దాడులు నిర్వహించారు పోలీసులు.
సీఈఓ ప్రతీక్ చావే, హెచ్ ఆర్ దాసరి స్వర్ణలత, శ్రవణ్ లాల్ శర్మ లను అరెస్ట్ చేశారు పోలీసులు.
దేశ వ్యాప్తంగా పలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.
వీరిపై సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో 50 కి పైగా కేసులు రిపోర్ట్ అయినట్లు తెలిపారు.



