Thursday, April 30, 2026

చార్ధామ్ యాత్ర 2024ని సందర్శించే యాత్రికులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్

- Advertisement -

చార్ధామ్ యాత్ర 2024ని సందర్శించే యాత్రికులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్

ఉత్తరాఖండ్ మే 25
చార్ధామ్ యాత్రను చేపట్టాలనుకునే యాత్రికులందరు తప్పనిసరిగా  రిజిస్ట్రేషన్ చేసుకొవలని  ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది ఈ రిజిస్ట్రేషన్ ద్వారా చార్ ధామ్  తీర్థయాత్రను  క్రమబద్ధీకరించేందుకు తోడ్పడుతాయి  భక్తుల భద్రత సులబతరం చేసేందుకు తోడ్పడుతుందని. ఉత్తరఖాండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి.  రాధా రాటురి ఒక ప్రకటనలో తెలియచేశారు. 1*తప్పనిసరి నమోదు అమలు: చార్‌ధామ్ యాత్ర కోసం వెళ్ళేయాత్రికులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ చేసుకోని భక్తులు చారధామ్ దర్శించడానికి ప్రయత్నించవద్దని సూచించారు.యాత్రకు రిజిస్ట్రేన్ చేసుకోని భక్తులను నిర్ణీత చెక్‌పాయింట్ వద్ద ఆపివేయబడతారని మరియు సరైన రిజిస్ట్రేషన్ లేకుంటె భక్తులను అనుమతించబడదని సూచించారు. 2 * నమోదు తేదీలకు కట్టుబడి ఉండటం: యాత్రికులు తాము నమోదు చేసుకున్న నిర్దిష్ట తేదీలకు కట్టుబడి ఉండాలని. ఇది సందర్శకుల తాకిడిని ధామ్‌ల వద్ద క్రమాన్ని నిర్వహించడానికి సహాయపడుతుందిని, సూచించారు.3* టూర్ ఆపరేటర్లు మరియు ట్రావెల్ ఏజెంట్ల బాధ్యత: అన్ని టూర్ ఆపరేటర్లు మరియు ట్రావెల్ ఏజెంట్లు తమ క్లయింట్లు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అవసరమైన రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసేందుకు సహకరించాలని దిని వలన యాత్ర సమయంలో భక్తులకు ఎటువంటి  అసౌకర్యాం జరగకుండ చూసేందుకు తోడ్పడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్