*మోడీ హటావో దేశ్ కో బచావో*
జమ్మికుంట జూన్ 25 (వాయిస్ టుడే) : 24 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మరియు NTA
ఈరోజు జమ్మికుంట లోని అంబేద్కర్ చౌరస్తాలో నీట్ పరీక్ష ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారం జరిగి నెల రోజులు కావస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లు లేకుండా ఉన్న కేద్రప్రభుత్వం పై నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వయిరీ జరిపించాలి.
* నీట్ పరీక్షను రద్దు చేయలి.
* నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి.
* నీట్ పరీక్ష నిర్వహించడం లో NTA విఫలమైంది కాబట్టి NTA ని బ్యాన్ చేయాలి.
* నీట్ విద్యార్థులకు అ పిల్లలతల్లితండ్రులకు కేంద్రప్రభుత్వం ,మోడీ క్షమాపణ చెప్పాలి
* నీట్ పరీక్షని సమర్ధవంతంగా నిర్వహించలేని కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చెయ్యాలి.
ఈ కార్యక్రమంలో NSUI కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు MD. ఇమ్రాన్, NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్ ,NSUI జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ వంశి మరియు జమ్మికుంట మండల ప్రెసిడెంట్ అవినాష్, నాగరాజు, జియా ఉల్లా,శివ, సమీర్, నరేష్, రాజేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.




