- Advertisement -
విగ్రహం ధ్వంసమైనా పట్టించుకోరా…?
Do you mind if the statue is destroyed…?
శ్రీకాళహస్తి ఆగస్టు 21
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. త్రినేత్ర అతిథి గృహం ముందు వివిధ రకాల విగ్రహాలను సిమెంటుతో నిర్మాణం చేశారు. నెల రోజుల క్రితం ఒక నంది విగ్రహానికి పగుళ్లు వచ్చాయి. ఈ అతిథి గృహానికి ఎదురుగా ఆలయ పరిపాలన కార్యాలయం ఉంది. అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రతిరోజు పగిలి పోయిన నంది విగ్రహాన్ని చూస్తూనే ఉన్నారు. అయితే కనీసం తొలగించే చొరవ కూడా తీసుకోవడం లేదు. ప్రతిరోజు ప్రముఖులు వచ్చి వెళ్లే మార్గంలో ఉన్న ఈ గ్రహాన్ని తొలగించడంతో పాటు కొత్త విగ్రహాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇఓ ఎస్ వి ఎన్ మూర్తి దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవలసి ఉంది
- Advertisement -




