- Advertisement -
ఏడుగురు కూలీల మృతదేహాలకు పోస్టు మార్టెం
seven laborers dead bodies were Post mortemకొవ్వూరు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీడిపిక్కలు వ్యాన్ తిరగపడి ఏడుగురు కూలీలు దుర్మారణం చేందిన విషయం తెలిసిందే. మృతులు తాడిమల్ల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసారు. మృతుల కుటుంబ సభ్యులు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
- Advertisement -




