- Advertisement -
తాడిపత్రిలో 1,20 వేల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్న పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు
president of Brahmin community bought laddoo for 1,20,000 rupees in Tadipatriతాడిపత్రి
తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో పెద్దమ్మ స్వామి గుడి సర్కిల్లో ఏర్పాటు చేసిన 23 అడుగుల వినాయక విగ్రహం వద్ద వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డును వేలంపాట వేయగా, వేలంపాటలో పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కెఎం రామకృష్ణ, లక్ష ఇరవై వేల రూపాయలకు కైవసం చేసుకున్నాడు. గత సంవత్సరం లడ్డు వేలం పాట లక్ష్యా 90 వేలకు ఓబిరెడ్డి కైవసం చేసుకోగా, ఈ సంవత్సరం 2024 లో లక్ష 20000 రూపాయలకు లడ్డూను పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కెఎం రామకృష్ణ కైవసం చేసుకున్నారు. అనంతరం ఆయనను వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కెయం రామకృష్ణ, కాకర్ల రంగయ్య, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -




