- Advertisement -
టీటీడీ బాధ్యులను శిక్షించాలి
TTD responsible should be punished
చేవెళ్ల
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారంపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయని ఆయన అన్నారు. ఉత్తమమైన ఆవు నెయ్యి కిలోకు వెయ్యి ఉంటుంది. కానీ 320కి ఎలా కోట్ చేస్తారు అది కల్తి నెయ్యి కావచ్చు అని ఆరోపించారు. బాధ్యులను గుర్తించి వెంటనే వారిని శిక్షించాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయస్థాయిలో ధార్మిక పరిరక్షణ పరిషత్తు ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన కోరారు.
- Advertisement -



