- Advertisement -
మూఢ నమ్మకాలతో ఊరంతా ఖాళీ
The whole town is empty of superstitions
నల్గోండ
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం… ఇటీవల గ్రామంలో వరస మరణాలు సంభవించాయి. అనారోగ్యంతో కొంతమంది.. రోడ్డు ప్రమాదంలో మరికొందరు.. వయసు మళ్ళిన వారు మృత్యువాత పడ్డారు. గ్రామానికి కీడు దాపరించడంతోనే ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని భావించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీడు పోవాలంటే సూర్యోదయాన్ని కంటే ముందే పిల్ల పెద్దలతో సహా ఒకరోజు ఊరు ఊరంతా ఖాళీ చేసి సూర్య అస్తమయం వరకు ఊరు బయట ఉండాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. దీంతో గ్రామ ప్రజలంతా పొద్దు పొడవకముందే ఇండ్లు విడిచి ఊరి పొలిమేరు దాటరు. అక్కడే వంట వార్పు చేసుకున్నారు. ఈ ఘటనతో ఊరంతా నిర్మానుష్యంగా మారింది. గత పది నెలల కాలంలో చిన్న పెద్ద బేధం లేకుండా 70 మంది వరకు గ్రామస్తులు మృత్యువాత వడ్డారని. దీనికి గ్రామానికి సోకిన కీడే కారణంగా భావిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కీడు పోవడానికే ఒకరోజు ఊరు విడిచి వెళ్లినట్లు చెప్పారు.
- Advertisement -