- Advertisement -
కేతిరెడ్డి మరదలుకు రెవెన్యూ నోటీసులు
Revenue notices for Ketireddy Maradaluధర్మవరం
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులో పేర్కోన్నారు. లేదంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 5న ధర్మవరం నీటిపారుదల శాఖ అధికారులు నోటిసులు జారీ చేసారు. కేతిరెడ్డి మొత్తం మొత్తం 20 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారు అంటూ నోటీసులు ఇచ్చారు. కేతిరెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఈనెల 6న నోటీసులు అందుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం హిమాలయాల్లో వున్నారు.
- Advertisement -




