- Advertisement -
శబరిమలకు విమానయాన సంస్థలు
Airlines to Sabarimala
తిరువనంతపురం, నవంబర్ 19, (వాయిస్ టుడే)
కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల దివ్యక్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు దర్శించుకుంటారు. ప్రధానంగా డిసెంబర్ – జనవరి నెలల్లో జరుగుతున్న మండల మకరవిళక్కు పూజల సమయంలో భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, వారి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వం, విమానయాన సంస్థలు అదనపు విమాన సర్వీసులు ప్రకటించాయి. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రత్యేకంగా సంక్రాంతి, మకరవీధి పూజలు సమయంలో భక్తుల తాకిడి ఒక పెద్ద సవాలుగా మారింది. దీంతో, ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు భక్తుల రవాణాకి అదనపు విమాన సర్వీసులు అందించాలని నిర్ణయించాయి. ఈ అదనపు విమాన సర్వీసులు శబరిమల దర్శనానికి వచ్చే భక్తులకు ఒక గొప్ప పరిష్కారంగా మారాయి. భక్తులు, విమాన సేవల ద్వారా త్వరగా తమ లక్ష్యానికి చేరుకోగలుగుతున్నారని అభిప్రాయపడుతున్నారు. శబరిమలై భక్తుల సౌకర్యార్థం చెన్నై నుంచి కొచ్చికి రోజుకు ఎనిమిది విమానాలు నడుపుతున్నట్టు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. చెన్నై నుంచి నడిచే ఎనిమిది విమానాలతో పాటు బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే మూడు విమానాలు కొచ్చి వరకు పొడిగించారు.జనవరి 25వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. అలాగే ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు చెన్నై నుంచి కొచ్చికి విమాన సేవలందిస్తాయి.మండల సీజన్ డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. వచ్చేనెల 30 నుంచి మొదలయ్యే మకరవిళక్కు సీజన్ 2025 జనవరి 20 వరకు కొనసాగుతుంది. అప్పుడు కూడా మండల దీక్షలు తీసుకున్న అయ్యప్ప స్వాములు భారీగా తరలివస్తారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో విమాన సంస్థలు కూడా అదనపు సర్వీసులు నడిపేందుకు రెడీ అవుతున్నాయి.
- Advertisement -



