- Advertisement -
పోలీసు క్యాంపుపై మావోయిస్టుల కాల్పులు
Maoists firing on police camp
ముగ్గురు జవాన్లకు గాయాలు
బీజూపూర్
తెలంగాణ-చత్తీస్-ఘడ్ సరిహద్దు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు అర్ధరాత్రి కాల్పులకు దిగారు. బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీడిపల్లి పోలీస్ క్యాంపుపై కాల్పులకు దిగారు. ఘటనలో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులకు-మావోయిస్టులకు మధ్య శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎదురు కాల్పులు కొనసాగాయి. రెండు రోజుల క్రితమే జిడ్ పల్లి పోలీస్ క్యాంపు ప్రారంభించారు. కాల్పుల సమయంలో జిల్లా ఎస్పీ, సిఆర్పిఎఫ్ డిఐజి క్యాంపులో వున్నారు.
- Advertisement -



