- Advertisement -
జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా కృష్ణవేణి విద్యార్థుల ర్యాలి
Krishnaveni students rally on the occasion of National Farmers Dayకమాన్ పూర్
రామగిరి మండలం, కల్వచర్ల గ్రామంలో గల కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ లో భారత దేశ 5వ ప్రధాని స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ గారి 123 వ జన్మదిన పురస్కరించుకుని జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా
ముత్తారం మండలం లోని లక్కారం, మచ్చుపేట మరియు రామగిరి మండలం లోని బేగంపేట గ్రామాలలో విద్యార్థిని, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో కృష్ణవేణి విద్యార్థులు రైతులు చేసే కష్టం గురించి,
రైతులు దేశానికి వెన్నుముక లాంటి వారు అని, వారు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో, వారు సాగు చేసే వివిధ రకాల పంటల గురించి చాలా బాగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్
చందుపట్ల. తిరుపతి రెడ్డి , ప్రిన్సిపాల్ బర్ల. శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ లు అత్తే చంద్రమౌళి, మేడగొని. సతీష్, మాజీ తాజ ఎంపీటీసీ పంజాల కుమార స్వామి, పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి,
రంజిత్ రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -




