- Advertisement -
ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పని చేస్తా–ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
AP CM Chandrababu Naidu will work for NTR's ambition
అమరావతి,
: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోషల్
మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ‘‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు
అన్న సూక్తిని తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని అన్నారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలవారికి
రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పని చేస్తాం. తెలుగు జాతిని నెంబర్ వన్గా మారుస్తాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు
- Advertisement -



