Monday, February 23, 2026

 కాళేశ్వరం కథ కంచికే

- Advertisement -

 కాళేశ్వరం కథ కంచికే
కరీంనగర్, మే 20, (వాయిస్ టుడే )

The story of Kaleshwaram is told in Kanchi.

కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నది. కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నివేదికలను పరిశీలించిన తర్వాత కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలు స్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో జరిగినందున అప్ప టి సీఎం కేసీఆర్, సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను విచారణకు పిలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయి తే ఇప్పటికే ముఖ్యమైన అధికారులు, కాంట్రాక్టర్లు, నిపుణులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించింది. కీలక సాక్ష్యాధారాలను సేకరించిం దిదాదాపు నివేదిక తుది దశకు చేరుకున్న ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ పెద్దల విచారణ అవసరం లేదని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ నెలాఖరులోగా తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సమర్పిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాలపాటు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుండ టంతో ఈ దఫాలోనే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత సర్కారు పెద్దల తీరును ఎన్డీఎస్‌ఏ రిపోర్టు తప్పుబట్టింది.ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావాల్సి వస్తుందేమోనని పెద్ద ఎత్తున చర్చ జరిగినా చివరకు కమిషన్ ఇక విచారణలు ఆపేసి నివేదిక సిద్ధం చేసే పనిలో ఉందన్న సమాచారం బీఆర్‌ఎస్ వర్గాలకు సంతోషాన్నిస్తోంది.డిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించగా, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్‌ గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుంది. మూడు బ్యారేజీలపై విచారణ  ప్రారంభించిన కమిషన్ నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదికను పరిశీలించింది. దీంతోపాటు కాగ్ అభ్యంతరాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో విజిలెన్స్ రిపోర్టును కూడా తెప్పించుకొని పరిశీలించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న  ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఈఎన్సీలనూ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలు.. విచారణలో చెప్పిన విషయాలను సరి చూసుకుంది. అదే  సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసింది. వారిని కూడా పిలిచి విచారించింది.నిబంధనల ఉల్లంఘన.. ఏయే సంస్థల నుంచి ఎలా అప్పులు తెచ్చారు.. డిజైన్ ఫైనల్ చేసిందెవరు..? అన్న అంశాలపై కీలకంగా చర్చించింది. త్వరలోనే కేసీఆర్‎ను విచారణకు పిలుస్తారనే చర్చ విస్తృతంగా జరిగింది. నివేదిక ఫైనల్ చేసే సమయంలో పిలుస్తారనే ఊహాగానాలకు తెరలేచింది. కానీ న్యాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకొని ఈ ముగ్గురు నేతలను పిలవడం లేదని తెలుస్తోంది కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా? పిలిస్తే ఆయన హాజరవుతారా? అనే ప్రశ్నలకు ఇంతటితో తెర పడినట్టుంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగింపు దశకు వచ్చిన వేళ మాజీ సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్