తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపర్చిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు: తహశీల్దార్ సునీతా ఎలిజబెత్
ముదిగొండ మండలం సెప్టెంబర్ 9 వాయిస్ టుడే
Kaloji Jayanti celebrated with great pomp at the Tahsildar's office
ముదిగొండ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను తహశీల్దార్ సునీతా ఎలిజబెత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రెవిన్యూ సిబ్బంది అందరూ కలిసి కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు, పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సునీతా మాట్లాడుతూ తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపర్చిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని, ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా కాళోజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ కళ్యాణి,సీనియర్ అసిస్టెంట్ నాగలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్లు రమా దేవి, జాన్ పాషా,అబ్బాస్, కర్ణ, భూ భారతి ఆపరేటర్ శ్రీ హరి,అటెండర్లు నాగుల్ మీరా,నిహారిక పాల్గొన్నారు.



