* కాంగ్రెస్ లోకి కోనరావుపేట మండల బిఆర్ఎస్ నాయకులు….
రాజన్న సిరిసిల్ల జిల్లా(సెప్టెంబర్ 15) (వాయిస్ టుడే)
Huge additions to Congress...

*రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ మాజీ ఛైర్మన్,మాజీ ఎంపీపీ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాసాని శంకర్ గౌడ్,మర్రిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్,కొలనూరు ఫ్యాక్స్ డైరెక్టర్ ఇప్ప రాములు, మాజీ వార్డు సభ్యులు శంకరవ్వ, బొడ్డు కిషన్ సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని అన్నారు..బిఆర్ఎస్ పార్టీలో దొరల పాలనలో తమకు సరైన గుర్తింపు లేదని, బీసీ బిడ్డ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేస్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని అన్నారు.



