- Advertisement -
మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభించాలి
A sewage treatment plant should be started.
రాజన్న సిరిసిల్ల జిల్లా ( సెప్టెంబర్ 15) వాయిస్ టుడే
రాజన్న సిరిసిల్ల జిల్లా. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ డబుల్ బెడ్ రూమ్ ప్రక్కనగల మురికి నీటి శుద్ధి కేంద్రం పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా, ప్రారంభానికి నోచుకోవడం లేదు. పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు 200 మంది రైతులకు సంబంధించిన 300 ఎకరాల్లోకి సిరిసిల్ల పెద్ద మురికి కాలువ నీరు పొలాల్లోకి మళ్ళించడం వల్ల రైతులు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించి, రైతుల పొలాల్లోకి మురికి కాలువ నీళ్లు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సోమవారం రోజున స్థానిక రైతులు కోరుతున్నారు
- Advertisement -



