జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన – సోమాజిగూడలో మిద్దెల జితేందర్ ప్రచారం జోరు
హైదరాబాద్, నవంబర్ 7 (వాయిస్ టుడే)
Seva Dal shows strength in Jubilee Hills constituency – Middela Jitender’s campaign in full swing in Somajiguda


జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవ దళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ నేతృత్వంలో కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో ఎల్లారెడ్డిగూడెం హనుమాన్ టెంపుల్, అంబేద్కర్ నగర్, లా కాలేజ్, శ్రీనగర్ కాలనీ, నాగార్జున కాలనీ, అమీర్పేట్ క్రాస్ రోడ్, కమ్మ సంఘం ప్రాంతాలు సహా పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ “ప్రజా ప్రభుత్వం – ప్రజల అభివృద్ధి” అనే నినాదంతో ప్రచారం చేశారు.
జితేందర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.48 లక్షలతో పలు కార్యక్రమాలు చేపట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి యుగం ప్రారంభమైందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు
-
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
-
₹500 గ్యాస్ సిలిండర్,
-
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,
-
రైతులకు ₹2 లక్షల రుణమాఫీ,
-
వైట్ రేషన్ కార్డుల పునరుద్ధరణ,
-
ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూం ఇళ్లు,
-
₹10 లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ వైద్య సేవలు
అమలులో ఉన్నాయని వివరించారు.
అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
జితేందర్ మాట్లాడుతూ, “10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే ఫలితాలు చూపిస్తోంది. ప్రజలు తిరిగి కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం” అన్నారు.
సోమాజిగూడ నుంచి అమీర్పేట్ క్రాస్ రోడ్ వరకూ “గల్లీ గల్లీకి వెళ్లి ప్రజలతో మాట్లాడి, రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాం” అని సేవాదళ్ నాయకులు తెలిపారు.
ప్రచార కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు సాయిరామ్, రమేష్ గౌడ్, శివశంకర్, భరత్ రెడ్డి, పల్లె శేఖర్, మహిళా కార్యకర్తలు లక్ష్మీ, రమ్య తదితరులు పాల్గొన్నారు.



