ఎంపీ వద్దిరాజుకు జీవన సాఫల్య పురస్కారం – భారత్ గౌరవ్ ఫౌండేషన్ సత్కారం
అవాసా హోటల్ కన్వెన్షన్ హాల్, హైటెక్ సిటీ – హైదరాబాద్
MP Vaddiraju honored with Lifetime Achievement Award – Bharat Gaurav Foundation

భారత్ గౌరవ్ ఫౌండేషన్ వార్షిక పురస్కారాలు శుక్రవారం హైటెక్ సిటీలో ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను సత్కరించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు ఫౌండేషన్ ప్రతిష్టాత్మక “జీవన సాఫల్య పురస్కారం” (Life Time Achievement Award) ను అందజేశారు. పురస్కారం స్వీకరించిన తర్వాత మాట్లాడిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ— కేసీఆర్, కేటీఆర్ ల పాత్రపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్ర అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్రను గుర్తు చేశారు. “సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ, తన పదేళ్ల పాలనలో హైదరాబాద్ను ప్రపంచ నగరాలకు సరితూగేలా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్” అని రవిచంద్ర అన్నారు. అలాగే కేటీఆర్ పనితీరును ప్రశంసిస్తూ— “ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖలలో ఆయన చూపిన దూరదృష్టి వల్లే నేటి హైదరాబాద్ న్యూయార్క్, డల్లాస్, చికాగోలకు సమానంగా అభివృద్ధి చెందింది. ఐటీ, ఫార్మా, స్టార్ట్-అప్స్ రంగాల్లో హైదరాబాదు గ్లోబల్ మ్యాప్పై నిలిచింది” అని వివరించారు. యువత శక్తిని వినియోగిస్తే దేశం మారుతుంది తమ ఖమ్మం యూనిటీ రన్ సందర్భంగా యువత పెద్ద శాతం 40 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సులో ఉన్నారని గుర్తు చేసిన రవిచంద్ర— “మన దేశం యువతతో నిండి ఉంది. అవకాశాలు ఇస్తే వారు ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం ఉంది. వారి ప్రతిభ దేశాభివృద్ధికి దోహదపడాలి,” అని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ముఖ్య ప్రాధాన్యతలు ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా తన భవిష్యత్ కర్తవ్యాలను చెప్పుకొచ్చారు— విద్య మరియు వైద్యారోగ్య రంగాల బలోపేతానికి కృషి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం గ్రామీణ–పట్టణ అభివృద్ధి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించే చర్యలు యువత నైపుణ్యాభివృద్ధిపై పథకాలు రూపొందించే ప్రయత్నం. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై సందేశాలు ఇచ్చారు. వారిలో— రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కోవా లక్ష్మణ్,ప్రముఖ యోగ గురువు చిన్నజీయర్ స్వామి,ఒలింపిక్ ఛాంపియన్ సైనా నెహ్వాల్, సీనియర్ IPS అధికారి అంజనీకుమార్ ఇతరులు ఉన్నారు. వేదికపై ఎంపీ రవిచంద్రను నిర్వాహకులు పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించి, శాలువాతో సత్కరించారు. ఫౌండేషన్ చైర్మన్ సందేశ్ యాదవ్ మరియు బృందం కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథుల ప్రసంగాలు, పురస్కార గ్రహీతల అనుభవాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



