Tuesday, March 24, 2026

 మద్రాస్ హైకోర్టుకు చేరిన శ్రీదేవి ఆస్తి వివాదం..

- Advertisement -

 మద్రాస్ హైకోర్టుకు చేరిన శ్రీదేవి ఆస్తి వివాదం..
చెన్నై, మార్చి 23,

Sridevi’s Property Dispute Reaches Madras High Court
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి చెందిన ఆస్తి వివాదంపై ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ , కుమార్తెలు జాన్వీ కపూర్ , ఖుషి కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబ ఆస్తిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదాన్ని పరిశీలించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను మార్చి 26, 2026కి వాయిదా వేసింది. చెంగల్పట్టులోని సుమారు 4.7 ఎకరాల స్థలంపై హక్కుల కోసం కొందరు వ్యక్తులు దాఖలు చేసిన సివిల్ దావాను కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం జాయింట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ టి.వి. తమిళ్సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం, స్థానిక కోర్టులో జరుగుతున్న చర్యలపై తాత్కాలిక స్టే విధించింది. దీనివల్ల ప్రస్తుతానికి కపూర్ కుటుంబానికి కొంత ఊరట లభించినట్లయింది. అసలు ఈ వివాదం 1988లో మొదలైంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఈ విలువైన ఆస్తిని శ్రీదేవి ఏప్రిల్ 19, 1988న చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఈ భూమికి అసలైన యజమాని ఎం.సి. సంబంధ ముదలియార్. ఆయన కుటుంబ సభ్యుల మధ్య 1960లో జరిగిన ఆస్తి పంపకాల ఒప్పందం ఆధారంగానే శ్రీదేవి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుండి ఈ ఆస్తి ఆమె కుటుంబం ఆధీనంలోనే ఉంది.అయితే, ముదలియార్ వారసులమంటూ ముగ్గురు వ్యక్తులు ఈ ఆస్తిపై హక్కులు కోరుతూ వివాదం సృష్టించారు. దీనిపై బోనీ కపూర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సదరు వ్యక్తులు 2005లో తాంబరం తహసీల్దార్ నుండి వారసత్వ ధ్రువపత్రాన్ని పొందారు. అయితే ముదలియార్ కుటుంబం అసలు తాంబరంలో నివసించలేదని, మైలాపూర్లో ఉండేవారని బోనీ కపూర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వారసులమని చెప్పుకుంటున్న వారిలో ఒకరు ముదలియార్ కుమారుడి రెండో భార్య అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ, మొదటి భార్య బతికి ఉండగానే జరిగిన ఈ వివాహం చట్టబద్ధం కాదని, హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారికి ఆస్తిలో వాటా ఉండదని బోనీ కపూర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్, ఆ ముగ్గురు వ్యక్తుల పేరుతో ఉన్న మోసపూరిత వారసత్వ ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. దీనిపై నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్కు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ హైకేసు హైకోర్టు పరిధిలో ఉంది. మోసపూరిత పత్రాలతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీదేవి కుటుంబం కోరుతోంది. వచ్చే విచారణలో కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్