గుజరాత్ తీరానికి ‘జగ్ వసంత్’..
42 వేల టన్నుల గ్యాస్తో రాక
అహ్మాదాబాద్
‘Jag Vasant’ Arrives off Gujarat Coast…
Arrives Carrying 42,000 Tonnes of Gas
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు మరో ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది. ‘జగ్ వసంత్’ అనే పేరు గల ఈ నౌక, 42,000 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)తో శుక్రవారం
గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు వచ్చింది. హర్మూజ్ జలసంధి మూసివేత భయాల నడుమ ఈ నౌక తన ప్రయాణ మార్గంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.
సోమవారం ‘పైన్ గ్యాస్’ అనే మరో ట్యాంకర్తో కలిసి ప్రయాణం ప్రారంభించిన ‘జగ్ వసంత్’.. సంప్రదాయ మార్గానికి బదులుగా ఖేష్మ్-లారక్ ఛానెల్ ద్వారా హర్మూజ్ జలసంధిని దాటింది. ఈ మార్గంలో
ప్రయాణిస్తున్నప్పుడు తమను స్పష్టంగా భారతీయ నౌకలుగా గుర్తించేందుకు తగిన సందేశాలను ప్రసారం చేశాయి. ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతితోనే ఈ నౌకలు ఇలా ప్రయాణించి ఉండొచ్చని
నిపుణులు భావిస్తున్నారు.



