Friday, April 10, 2026

మైలేజ్ కన్నా… డ్యామేజ్ ఎక్కువ..!

- Advertisement -

మైలేజ్ కన్నా… డ్యామేజ్ ఎక్కువ..!
హైదరాబాద్, ఏప్రిల్ 8, (వాయిస్ టుడే )

More damage than mileage!
తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాడిన పదజాలం విన్నవారికి

ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలో కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వంపై వేటు లేదా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు చెప్పకనే చెప్పేశారు సీఎం. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీలో నిప్పులు

చెరిగిన విధానం, ఏకంగా ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ నక్సలైట్‌గా కౌశిక్ రెడ్డిని పోల్చిన తీరు పెను సంచలనంగా మారింది. ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలో ఇంత రచ్చ అవసరమా అని కొందరు అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి బీఆర్‌ఎస్

ఎమ్మెల్యేగా 2021లో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి  ఆయన దూకుడు మాములుగా లేదంటున్నారు రాజకీయ విమర్శకులు. తాజాగా సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లడుతుండగా

తుపాకీతో కాల్చిపడేస్తానంటూ అసెంబ్లీలో సైగలు చేసి, అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎథిక్స్ కమిటీని సైతం ఏర్పాటు చేసి వేటుకు రంగం సిద్దం చేశారు. కౌశిక్ రెడ్డిని వివాదాలు వెంటాడతాయో లేక తానే

వివాదాలను ముద్దాడుతాడో తెలియదు కానీ, ఎక్కడుంటే అక్కడ పొలిటిక్ రచ్చ సర్వసాధారణంగా మారింది. 2024లో హైదరాబాద్‌లో విధినిర్వహణలో ఉన్న ఓ ఎస్‌ఐపై అనుచితంగా ప్రవర్తించాడని, విధులకు ఆటంకం

కలిగించాడని కౌశిక్ రెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది. హైదరాబాద్ కౌశిక్ నివాసం చుట్టూ భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి ముందు తన భార్య శాలినీ పుట్టినరోజు సందర్భంగా

యాదాద్రి గుడిలో ఫొటో షూట్ నిర్వహించి, సోషల్ మీడియాలో వీడియోలో పోస్ట్ చేయడంపై కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.2025లో కరీంనగర్ కలక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో జగిత్యాల

ఎమ్మెల్యే సంజయ్ మాట్లడుతుండగా, నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి చెప్పంటూ కౌశిక్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకోవడం, సంజయ్‌తో బాహాబాహీకి దిగడం వివాదంగా మారింది. తనపైన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ

ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్  126,115, 352, 292ల కింద కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు, హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్  చేసి కరీంనగర్ స్టేషన్ కు

తరలించారు.ఓ గ్రానేట్ సంస్ద యజమానిని బెదిరించి 50లక్షలు డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై జూన్ 1, 2025లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్

చేసి, ఎక్స్ టార్షన్ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీరా, గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవల సమక్క సారక్క

జాతర జరుగుతున్న సమయంలో వీణవంక మండలంలోని సమ్మక్క జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని

మతం పేరుతో దూషించాడంటూ పెను దుమారం రేగింది. అదే రోజు బలవంతంగా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, రోజంతా హైడ్రామా కొనసాగింది. ఆవేశంలో మాట్లడాను , కావాలని మతం పేరుతో పోలీసు

అధికారిని దూషించలేదంటూ క్షమాపణలు కోరుతూ మరుసటి రోజు వీడియో విడుదల చేయడంతో వివాదం కాస్తా తాక్కాలికంగా సర్దుమణిగింది.ఇలా ఒకటేమిటి హుజూరాబాద్ గడచిన ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి

ఓట్లు అభ్యర్ధించిన తీరు, కుటుంబ సమేతంగా విడుదల చేసిన వీడియోలు రాజకీయంగా వివాదాలను తెచ్చిపెట్టాయి. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌కు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అరెకెపూడి  గాంధీ, దానం నాగేందర్‌పై కౌశిక్

చేసిన వ్యాఖ్యలపై అంతే స్థాయిలో వాళ్లు స్పందించిన విధానం తిరిగి కౌశిక్ మెడకు చుట్టుకున్నాయి.కండలు తిరిగిన శరీరాకృతితో కనిపించే కౌశిక్ రెడ్డి, హావభావాలు, మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులతో దురుసుగా

ప్రవర్తించిన తీరుతో అధికార కాంగ్రెస్ పార్టీ విసిగిపోయింది. అదును చూసి దెబ్బకొట్టింది. అసెంబ్లీ నుంచి సాగనంపేందుకు సిద్దమైంది. అయితే బీఆర్‌ఎస్ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడుతో పార్టీకి డ్యామేజ్

జరుగుతుందో, మైలేజ్ వస్తుందో, అర్దం కాని అయోమయంలో కనిపిస్తోంది. సమర్థిస్తే పరువు పోతుంది. వెనుకేసుకొస్తే జనం నవ్వుతారేమో అనే దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి

బీఆర్‌ఎస్‌లోకి చేరి, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జరిగిన వరుస ఘటనల వల్ల పార్టీకి లాభం కంటే, నష్టమే ఎక్కువ. దూకుడు తప్పుకాదు, ఆవేశం తప్పుకాదు, కానీ ఎక్కడ వాడాలో తెలియకపోవడం అతిపెద్ద ముప్పు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరుగుతోందంటున్నారు రాజకీయ విశ్లేకులు. విమర్శించడం, దాడి చేయడం, అరెస్ట్ అవ్వడం, నోరు జారడం, క్షమాపణలు చెప్పడం.. ఇలా కౌశిక్ రెడ్డికి గత కొంతకాలంగా

అలవాటైపోయింది. ఈసారి అసెంబ్లీలో కడియంపై సైగలు చేసి అడ్డంగా దొరికేశాడంటున్న అధికార పార్టీ, భవిష్యత్‌లో మరెవరూ ఇలా మాట్లాడకుండా చేస్తామంటూ చెప్పిమరీ వేటు వేసేందుకు సిద్దమైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్