బాబాసాహేబ్ ఐడియాలసీ నిరంతరం మనమద్యే వుంటుంది
హైదరాబాద్
Babasaheb’s ideology will always remain amongst us.
భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్ లోని ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం అర్ధరాత్రి
నివాళులర్పించారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ బర్త్ డే కేక్ కట్ చేసారు.
కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదంటే అది బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షే. ఆర్టికల్ 3 అనే శక్తి ఇవ్వటం కారణంగే తెలంగాణ ఏర్పాటుకు పునాది పడింది. అంబేడ్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు.
ఆయన ఒక ఐడియాలజీ. ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేేడ్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. బాబా సాహెబ్ 135 వ జయంతి సందర్భంగానైనా ఆయనకు బుద్ది వచ్చి పేదలకు మంచి
చేయాలి. ఇప్పటికీ కూడా ప్రతి చోట దళితులు, మహిళలపై ఆకృత్యాలు ఇంకా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులే భూములు కోల్పోతున్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్
భూములను ప్రభుత్వాలు లాక్కుంటున్నాయి. ఈ పరిస్థితిని సవరించుకుంటూ పేదల భూములను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఇది. మనం వెలుగుమట్లలో చూశాం. పరిగిలో కూడా
అసైన్డ్ భూములనే పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. అక్కడ 12 వందల ఎకరాలు సేకరిస్తే అందులో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములే. బాబా సాహెబ్ అంటేనే ధైర్యం. ఆయనిచ్చిన ధైర్యంతో పేదవాళ్లకు
న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేడ్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. బాబా సాహెబ్ 135 వ జయంతి సందర్భంగానైనా ఈ
ప్రభుత్వానికి బుద్ది రావాలి. వాళ్లు పేదల పక్షాన నిలబడాలి. అంబేడ్కర్ గారంటే ఒక సాధారణ మనిషి కాదు. ఆయన ఒక ఐడియాలజీ, ఒక థాట్. ఆయన ఐడియాలజీ నిరంతరం మన మధ్యనే ఉంటుందని
అన్నారు.



