Wednesday, June 18, 2025

గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -

గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు

శ్రీనగర్‌: గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. ఇది కాస్త శ్రీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో కార్యకలాపాల అంతరాయానికి దారితీసింది. అధికారుల వివరాల ప్రకారం.. ఎయిర్‌ విస్తారా కు చెందిన ఓ విమానం 178 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరింది. అయితే.. ఆ ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులోని ‘ఏటీసీ ’కి సమాచారం అందింది. దీంతో అధికారులు, భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆ ఫ్లైట్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయిన వెంటనే ప్రయాణికులను, సిబ్బందిని కిందికి దించివేశారు. అనంతరం దాన్ని ఖాళీ ప్రదేశానికి తరలించి.. బాంబు స్క్వాడ్‌ బృందాలు, జాగిలాల సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలేమీ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామాలతో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు కార్యకలాపాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు చెప్పారు……

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్