- Advertisement -
బ్రీతింగ్ అనలైజర్ దొరికిందోచ్
సికింద్రాబాద్
వారం క్రితం బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులనుండి ఆల్కహాల్ బ్రీతింగ్ అనలైజర్ చోరికి పాల్పడిన నిందితుడ్ని బోయిన్ పల్లి క్రైమ్ దళం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు గట్కేసర్ లో నివాసం ఉంటున్న రామగుండంకు చెందిన కారు డ్రైవర్ కొత్తపల్లి శ్రవణ్ కుమార్ గా సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బ్రీతింగ్ అనాలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
- Advertisement -