బడ్జెట్ సమగ్ర స్వరూపం…
A comprehensive look at the budget...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆమె 8వ సారి ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మొత్తంగా రూ. 50,65,345 కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ను తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లు అని చూపించారు. మూల ధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా చెప్పుకొచ్చారు.
బడ్జెట్ సమగ్రస్వరూపం ఇదే
రెవెన్యూ వసూళ్లు – 34,20,409 కోట్ల రూపాయలు
పన్ను వసూళ్లు – 28,37,409 కోట్ల రూపాయలు
పన్నేతర వసూళ్లు – 5,83,000 కోట్ల రూపాయలు
మూల ధనం వసూళ్లు – 16,44,936 కోట్ల రూపాయలు
రుణాల రికవరీ – 29 వేల కోట్ల రూపాయలు
ఇతర వసూళ్లు – 47 వేల కోట్ల రూపాయలు
అప్పులు, ఇతర వసూళ్లు -15,68,936 కోట్ల రూపాయలు
మొత్తం ఆదాయం – 50,65,345 కోట్ల రూపాయలు
మొత్తం వ్యయం – 50,65,345 కోట్ల రూపాయలు
రెవెన్యూ ఖాతా – 39,44,255 కోట్ల రూపాయలు
వడ్డీ చెల్లింపులు – 12,76,338 కోట్ల రూపాయలు
మూల ధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు – 4,27,192 కోట్ల రూపాయలు
మూల ధన ఖాతా – 11,21,090 కోట్ల రూపాయలు
వాస్తవ మూల ధన వ్యయం – 15,48,282 కోట్ల రూపాయలు
రెవెన్యూ లోటు -5,23,846 కోట్ల రూపాయలు
నికర రెవెన్యూ లోటు -96,654 కోట్ల రూపాయలు
ద్రవ్య లోటు -15,68,936 కోట్ల రూపాయలు
ప్రాథమిక లోటు – 2,92,598 కోట్ల రూపాయలు
2025-26 బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు రక్షణ రంగానికే కేటాయించారు. ఆ తర్వాత ప్రయార్టీ గ్రామీణాభివృద్ధికి ఇచ్చారు నిర్మలా సీతారామన్. మూడో ప్రయత్నీ శాస్త్ర, సాంకేతిక రంగానికి కల్పించారు.
వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి. ..
రక్షణ రంగం – 4,91,732 కోట్ల రూపాయలు
గ్రామీణాభివృద్ధి – 2,66,817 కోట్ల రూపాయలు
హోం శాఖ – రూ. 2,33,211 కోట్ల రూపాయలు
వ్యవసాయం, అనుబంధ రంగాలు – 1,71,437 కోట్ల రూపాయలు
విద్యా రంగం – 1,28,650 కోట్ల రూపాయలు
ఆరోగ్య రంగం – 98,311 కోట్ల రూపాయలు
పట్టణాభివృద్ధి – 96,777 కోట్ల రూపాయలు
ఐటీ, టెలికాం – 95,298 కోట్ల రూపాయలు
ఇంధన రంగం – 81,174 కోట్ల రూపాయలు
వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – 65,553 కోట్ల రూపాయలు
సామాజిక, సంక్షేమ రంగం – 60,052 కోట్ల రూపాయలు
శాస్త్ర సాంకేతిక రంగం – 55,679 కోట్ల రూపాయలు