Thursday, January 16, 2025

విద్యుత్ చార్జీల పెంపుపైఆందోళన కార్యక్రమం

- Advertisement -

విద్యుత్ చార్జీల పెంపుపైఆందోళన కార్యక్రమం

A program of concern on the increase in electricity charges

మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

పత్తికొండ నూర్:
)విద్యుత్ చార్జీల పెంపుపై పత్తికొండ పట్టణం లో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ కూడలిలో మాజీ పిఎం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం భారీ ర్యాలీతో బయలుదేరి నాలుగు స్తంభాల కూడలిలో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపే దాదాపుగా నవంబర్ డిసెంబర్ నెలలో కరెంటు బిల్లులు దాదాపుగా 15,400 కోట్లు పెంచి ప్రజల మీద భారం పెట్టారు. సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్తికొండ మీటింగ్లో మాట్లాడిన విషయాల్ని గుర్తు చేస్తూ సంపద అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని చేయని పక్షంలో ప్రతిపక్షం  ప్రభుత్వం మెడలు వంచి పనిచేపిస్తామని తెలియజేశారు. అనంతరం కరెంట్ ఆఫీస్ కార్యాలయంలో ఏడి కి  వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గం లోని వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ఎంపీపీ నారాయణదాసు మండల కన్వీనర్ కారం నాగరాజు, గాంధీరెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, బళ్ళారి మోహన్ కృష్ణ, చిన్నహుల్తే  రాజు, చక్రాల లక్ష్మన్న, మండల వైసీపీ నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్