కేంద్రంతో సమన్యవయం లేని రాష్ట్ర ప్రభుత్వం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్
A State Government Lacking Coordination with the Centre
— BRS MLAs
పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద అన్నారు.
అవసరాలకు అనుగుణంగా స్టాక్స్ పెట్టుకుని ఉంటే ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. యూరియా కొరత తో రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో చూశాం. కేంద్ర ప్రభుత్వం తో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవడం లేదు. యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఇబ్బంది లేదు.. యుద్ధం లేని దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. కొరతని ముందుగా ఊహించలేక పోవడమే సమస్యకు కారణం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లేకపోతే పొద్దుగడవదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం మోపుతూ కాలం గడుపుతున్నారని అన్నారు.
సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలననారు.
ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ మాట్లాడుతూ 70 వ ట్రిప్పులో రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ తీసుకురాలేదు. ప్రజల్లో భయాందోళనకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తుంది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించాలని అన్నారు.



