- Advertisement -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
Additional Collector inspects polling stations
రాజన్న సిరిసిల్ల,
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం పరిశీలించారు. కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం, నెహ్రూనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇందిరా నగర్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని, హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు. పరిశీలనలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
- Advertisement -


