సంక్రాంతికి సీట్ల సర్దుబాటు
విజయవాడ, డిసెంబర్ 20
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడు దాదాపు రెండున్న గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కీలక భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగిందని, అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయని నాదెండ్ల చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి..? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నామన్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించిన్టు నాదెండ్ల తెలిపారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారని వైసీపీని ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగిందని చెప్పారు. పార్టీ అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతామని చెప్పారుసీట్ల సర్దుబాటుపై తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరికొన్ని సమావేశాల తర్వాత.. సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మ్యానిఫెస్టో పైనా ఇద్దరు నేతలూ చర్చించారు.ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ నడిచింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా ఇద్దరు నేతలూ చర్చించారు. అన్నీ కొలిక్కి వచ్చాక.. బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి. ఓట్ల అక్రమాలపై అధికార పార్టీ తీరును ఎండ గడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ అంశాల్లో అధికారపార్టీ అక్రమాలను అడ్డు కోవడంతో పాటు అసత్య ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు
సంక్రాంతికి సీట్ల సర్దుబాటు
- Advertisement -
- Advertisement -