రాంగోపాల్ వర్మ

విజయవాడ: వైయస్ మరణం దగ్గర నుంచి వ్యూహం కధాంశం సాగుతుంది. రెండు భాగాలు ఎన్నికలు కు ముందే విడుదల చేస్తాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు పిలిచి అడిగినా దర్శకత్వం చేయను . వైయస్ మరణం తరువాత పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా వేశారో చెబుతాం. వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమా లో ఉంది. వివేకానంద హత్య కేసులో నిందితులను నేను చూపిస్తా. భారత రెడ్డి ని దగ్గర నుంచి నేను చూశా. వైయస్, జగన్ లతో పాటు భారతి పాత్ర ఉంటుంది. ఎవరేమి సినిమా లు తీసినా నాకు అనవసరం. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా ఉంటుంది. ఎపి లో ఉన్న రాజకీయాలు ఆసక్తి గా ఉన్నాయి. ఎపి రాజకీయాల్లో ప్రధాన ఘట్టాలు ఇందులో ఉన్నాయి. నేను జగన్ కు అభిమానిని..కానీ ఎవరి పైనా ద్వేషం లేదు. ఇచ్చే వాళ్లు ఉంటే… హీరోలు రెమ్యూనేషన్ తీసుకోవడం లో తప్పు లేదు. ఎవరికి ఎంత అనేది మార్కెట్ ను బట్టి నిర్మాత చూసుకుంటారు. నా సినిమా వెనుక దాసరి కిరణ్ తప్ప ఎవరూ లేరు



