- Advertisement -
తిరుమల : తిరుమలలో బోనుకు మరో చిరుత చిక్కింది.. అలిపిరి నడక మార్గంలోని లక్షితపై దాడి చేసిన ఘటనకు అతి సమీపంలో 2850 మెట్టు వద్ద టిటిడి అటవీ శాఖా అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.. వారం రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ ఇవాళ వేకువజామున బోనులో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఏర్రకు చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.. చిరుతను తిరుపతిలోని జూపార్క్ కు తరలించారు.. ఇప్పటి వరకూ మొత్తం 6 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించి జూపార్క్ తరలించారు.. ఇందులో రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు..

- Advertisement -



