భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి
రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుతోనే అన్ని వర్గాలకు సమన్యాయం లభిస్తుందని సమగ్ర న్యాయం జరగాలంటే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని బోనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి అన్నారు.శనినారం వలిగొండ మండలం వెంకటాపురం, ముద్దాపురం చిత్తాపురం గోపరాజు పల్లి, వేములకొండ గురునాథ్ పల్లి గ్రామలా లో భారతీయ జనతా పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరు నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం లొ భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకొస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బిజెపి పార్టీ అణగారిన వర్గాల కోసం సమాజంలోని సకల జనుల సంక్షేమం కొరకు అవినీతి రహిత పారదర్శక పాలన కొరకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. బోనగిరి నియోజకవర్గం నుంచి తనకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బిజెపి మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ధనంజయ, పోతంశెట్టి రవీందర్,సిఎన్ రెడ్డి, పడమటి జగన్మోహన్ రెడ్డి చిక్కా కృష్ణ రాచకొండ కృష్ణ నర్సిరెడ్డి పూలు నాగన్న అభితేజి రెడ్డి మహేశ్వర్ రెడ్డి కొత్త రామచందర్ ఆయా గ్రామా శాఖ అధ్యక్షులు భూత అధ్యక్షులు మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు




