- Advertisement -
మేడే కు అన్ని వర్గాలు బంద్ పాటించాలి
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు
ఏఐటీయూసీ నేతల వినతి
జగిత్యాల,
కార్మిక దినోత్సవం పురస్కరించుకుని “మే” డే నాడు అన్ని వర్గాలు బంద్ పాటించేలా చూడాలని ఏఐటీయూసీ నాయకులు వెన్న సురేష్,కిరణ్ కుమార్,కోరుకంటి శ్రీనివాస్, ఎండి అథిక్ లు అధికారులను కోరారు.
బుధవారం ఈ మేరకు కార్మికశాఖ సహాయ కమిషనర్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు.
మే1న పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, దుకాణాలుఅలాగే కార్మికులు పనిచేసే ప్రాంతాలు మూసి ఉండేలా కార్మికశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -