Breaking News
Saturday, July 27, 2024
Breaking News

కంచర్ల కన్వెన్షన్‌ ను ప్రారంభించిన అల్లు అర్జున్

- Advertisement -

నల్గోండ, ఆగస్టు 19: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ పర్యటిస్తున్నారు. భట్టుగూడెంలో తన మామ, బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం దగ్గర నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద ‘కంచర్ల కన్వెన్షన్‌’ పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ఇప్పటికే ఆయన పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న అల్లు అర్జున్ మామ, స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. ఇప్పటినుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!