బద్వేల్ లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
బద్వేలు
మన్యం వీరుడు అల్లూరి సీతా రామ రాజు 127 వ జయంతి సందర్బంగా గురువారం బద్వేల్ మున్సిపాలిటీ ఆఫీసు లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో బద్వేల్ శాసన సభ్యురాలు డా.దాసరి సుధా పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాట చేసిన భారతీయ విప్లవ కారుడు అని కొనియడటం జరిగింది.అణగారిన గిరిజన ప్రజల ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగాడు.అదే విధంగా వారు సాయుధ పోరాటం మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటానికి గుర్తుగా వై. యస్.ఆర్.సి.పి.ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి వారి పేరుతో అల్లూరి సీతారామరాజు అని ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలపడం జరిగింది.కావున యువత అందరూ వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ రాజ గోపాల్ రెడ్డి,కమిషనర్ కృష్ణ ,మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు సుందర రామి రెడ్డి,కన్వీనర్ యద్దారెడ్డి , ప్రభాకర్ రెడ్డి,కౌన్సిలర్స్ ఓబుల్ రెడ్డి,రమేష్ బాబు,రమణ ,నాయకులు చెన్నా కృష్ణ రెడ్డి, రఘురాం రెడ్డి,వెంకట సుబ్బారెడ్డి ,మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బద్వేల్ లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -