Sunday, September 8, 2024

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆస్థులపై విచారణ జరిపాలి

- Advertisement -

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆస్థులపై విచారణ జరిపాలి
హైదరాబాద్
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడపెట్టుకున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరం, నగర శివార్లు, శివారు జిల్లాల్లోని అత్యంత ఖరీదైన భూములను తన పేరు మీద, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించాడని ఆయన వివరించారు. ఇవి కేవలం ఆరోపణలు కాదని, ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి సాక్షాలతో సహా వెల్లడిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మాజీ డిజిపి మహేందర్ రెడ్డి పై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఏసీబీ డిజిపి లకు ఫిర్యాదు చేసామని తెలిపారు. మంగళవారం సైదాబాద్ డివిజన్ కళ్యాణ్ నగర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సినీ నటి దివంగత సౌ0దర్యకు చెందిన వట్టి నాగులపల్లి లోని స్థలాన్ని ఆమె సోదరుడిని బెదిరించి తన పేరు పైకి బదలాయించు కున్నాడని తెలిపారు. గ్యాంగ్ స్టర్ నయిమ్, మరి కొంత మంది రౌడిసీటర్లను ముందుంచి భూములు కాజేసాదన్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో విధాన0లో సాగిందన్నారు. మరికొన్ని సందర్భాల్లో తన కిందిస్థాయి అధికారులను ఉపయోగించుకొని భూములు ఆర్జించాడని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి కూడా ఆయన పలు భూ వ్యవహారాలు చేశారన్నారు. ఆయన శైలి నచ్చక అప్పటి సీఎం రోశయ్య దూరం పెట్టారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహేందర్ రెడ్డి భూముల వ్యవహారంలో సమగ్ర విచారణ చేయించాలని ఆయన కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్