వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర ఏపీసీసీ భారీ నిరసన

- Advertisement -

వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర ఏపీసీసీ భారీ నిరసన

APCC massive protest near Gandhi statue in One Town

నిరసనలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
రాహుల్ గాంధీ పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
విజయవాడ
విజయవాడ వన్ టౌన్ గాంధీ విగ్రహం  దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.  ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గోన్నారు.
షర్మిల మాట్లాడుతూ  రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత.  రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ , షా లు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతుంది. ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.  ద్వేష పూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ దేశంలో ఎవరు తీవ్రవాదులు ?  ఏది తీవ్రవాదం ?  ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు 90 శాతం మంది ఉన్నారు. వాళ్లకు అభివృద్ధి లో వాట లేదు అని చెప్పడం అని తీవ్రవాదమా ?  అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పడం తీవ్రవాదమా ?  ఏది తీవ్రవాదమో బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు.
ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. – అన్ని కులాలను,మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ. అన్ని మతాలకు,కులాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నీచంగా బీజేపీ మాట్లాడుతుంది.  రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారు.  రాహుల్ అమ్మమ్మ,నాన్న ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో బలి అయ్యారు. ఈ విషయం బీజేపీ కి తెలియదా ?  రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రేమను నింపిన నాయకుడు.  రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే హక్కు బీజేపీ కి లేదని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలి..అందులో చలి కాచుకోవాలి.ఇదే బీజేపీ సిద్ధాంతం.  ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం బీజేపీ తీవ్రవాది పార్టీ అనడానికి నిదర్శనం కాదా?  కేవలం అగ్ర వర్ణాలకు కొమ్ము కాయడం తీవ్రవాదం అనిపించుకోదా? అణగారిన వర్గాలను తొక్కాలని బీజేపీ చూస్తుంది.  ఈ దేశంలో రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని అన్నారు.
బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతుంది.  రాహుల్ పాదయాత్రతో ఈ దేశంలో ధైర్యం నింపాడు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ. కేవలం 10 శాతం మంది మీ తొత్తుల చేతుల్లోనే భారతీయ వ్యాపారం మొత్తం కేంద్రీకృతం కాలేదా?  కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఎంత మంది దళిత,గిరిజనులు ఉన్నారు ?  వెనుక బడిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ 40 శాతానికి ఎందుకు తగ్గించారు ?  ఓబీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఎందుకు 15 శాతానికి తగ్గించారు ?  దళిత మహిళకు ప్రయోజనం చేకూర్చే కేంద్ర పథకాల నిధులను 20 శాతానికి ఎందుకు కోత పెట్టారు ? 10 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు 15 నుంచి 32 శాతానికి ఎలా పెరిగాయి ?  వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి.  బీజేపీ నీ హెచ్చరిస్తున్నం…మర్యాదగా రాహుల్ గాంధీ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular