Tuesday, May 19, 2026

25,000 అవయవ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న అపోలో హాస్పిటల్స్

- Advertisement -

ప్రతిష్టాత్మకమైన 25,000 అవయవ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న అపోలో హాస్పిటల్స్, క్లిష్టమైన అవయవ కొరత సమస్యను పరిష్కరించడానికి “పర్ఫెక్ట్ మ్యాచ్” ప్రచారాన్ని ప్రారంభించింది

Apollo Hospitals reaches milestone of 5,000 organ transplant surgeries

హైదరాబాద్, ఫిబ్రవరి 14, 2025: ఆసియాలో అగ్రగామి,  సమగ్రమైన ఆరోగ్య సంరక్షక  సేవల ప్రదాత అయిన అపోలో హాస్పిటల్స్, ఈరోజు తమ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో 25,000  విజయవంతమైన అవయవ మార్పిడి చికిత్సల మైలురాయిని విజయవంతంగా చేరుకున్నట్లు వెల్లడించింది.  ఆవిష్కరణ, నైపుణ్యం మరియు ప్రేమ పూర్వక  సంరక్షణ ద్వారా ప్రాణాలను కాపాడటానికి మరియు ఆరోగ్య సంరక్షణ విధానాన్ని మార్చడానికి చూపుతున్న అచంచలమైన  అపోలో హాస్పిటల్స్ నిబద్ధతను  ఇది వెల్లడిస్తుంది. ఈ 25,000 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు  కేవలం సంఖ్యాపరమైన సాధన మాత్రమే కాదు, రోగులు మరియు దాతల  కుటుంబాల ఆశ, స్థిరత్వం  మరియు అపోలో హాస్పిటల్స్ ట్రాన్స్‌ప్లాంట్ (అవయవ మార్పిడి) నిపుణుల బృందం యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.

ఈ సర్వోన్నత నైపుణ్య  వారసత్వంపై ఆధారపడి, అపోలో హాస్పిటల్స్ “పర్ఫెక్ట్ మ్యాచ్” ప్రచారాన్ని కూడా ప్రారంభించింది, ఇది అవయవ దాతల యొక్క కీలకమైన అవసరం గురించి అవగాహన పెంచడానికి, అవయవ దానం చుట్టూ ఉన్న సాధారణ అపోహలను తొలగించడానికి మరియు సంభావ్య దాతలుగా నమోదు చేసుకోవడానికి వ్యక్తులను ప్రేరేపించడానికి చేపట్టిన ఒక సమగ్ర కార్యక్రమం. ప్రాణాలను రక్షించే అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య మరియు తగిన అవయవాల లభ్యత మధ్య పెరుగుతున్న అంతరాన్ని పరిష్కరించడంలో  భాగంగా ఈ ప్రచారం ప్రారంభమైంది.

“పర్ఫెక్ట్ మ్యాచ్” ప్రచారంలో సామజిక ఆరోగ్య చర్చలు, విద్యా వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్ వనరులు మరియు రోగి అనుకూల బృందాలతో భాగస్వామ్యాలు వంటి వివిధ రకాల ఔట్రీచ్ కార్యకలాపాలు భాగంగా  ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ HPB, లివర్ మరియు ప్యాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి, హైదరాబాద్‌లోని రెయిన్‌బో విస్టాస్ కమ్యూనిటీ నివాసితులతో ఆకట్టుకునే రీతిలో జరిగిన సమాచార సదస్సు  కు  నాయకత్వం వహించారు. ఈ సదస్సులో, మార్పిడి అర్హత, అవయవ దాన ప్రక్రియ మరియు ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొంటున్న వ్యక్తులు మరియు కుటుంబాలపై అవయవ దానం చూపే తీవ్ర ప్రభావం గురించిన సందేహాలకు  డాక్టర్ సిద్ధాచారి సమాధానాలను అందించారు.

“25,000 అవయవ మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్యను చేరుకోవడం ఒక ప్రశంసనీయమైన విజయం, కానీ ఇది సమాజంలో ఉన్న అపారమైన అవసరాన్ని గుర్తు చేస్తుంది” అని డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి అన్నారు. “ప్రతిరోజూ, రోగులు ఈ అవయవ మార్పిడి కి సంబంధించిన వెయిటింగ్ లిస్ట్‌లో చేర్చబడుతున్నారు . విచారకరంగా, చాలామందికి అవసరమైన అవయవం సకాలంలో అందడం లేదు. ‘పర్ఫెక్ట్ మ్యాచ్’ ప్రచారం ద్వారా, అవయవ దానం గురించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ప్రాణాలను రక్షించే ఉద్యమంలో భాగం కావడానికి వ్యక్తులను శక్తివంతం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము ” అని అన్నారు.

అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ వి. తేజస్వి రావు ప్రజా అవగాహన మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఆయన మాట్లాడుతూ   “భారతదేశంలో అవయవ మార్పిడి రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అపోలో హాస్పిటల్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ‘పర్ఫెక్ట్ మ్యాచ్’ ప్రచారంతో, అవయవ దాన సంఖ్యను పెంచడానికి మరియు ఎక్కువ మంది రోగులు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన అవయవ మార్పిడిని పొందే అవకాశాన్ని పొందేలా చూసుకోవడానికి చేస్తోన్న మా ప్రయత్నాలలో మేము ఒక చిన్నదే కానీ ముఖ్యమైన అడుగు ముందుకు వేసాము” అని అన్నారు.

 అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ  “అవయవ మార్పిడి రోగులకు ప్రపంచ స్థాయి సంరక్షణ అందించడానికి మా బృందం పూర్తిగా కట్టుబడి ఉంది. అవయవ మార్పిడి అవసరమైన రోగులందరికీ అవయవ మార్పిడి అందుబాటులో ఉండేలా చేయాలనే మా లక్ష్యాన్ని నెరవేర్చడానికి ‘పర్ఫెక్ట్ మ్యాచ్’ ప్రచారం మరొక ముందడుగు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అవయవ దాతగా మారడానికి నమోదు చేసుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము” అని అన్నారు.

భారతదేశంలో అవయవ మార్పిడిలో అపోలో హాస్పిటల్స్ అగ్రగామిగా ఉంది, విస్తృత శ్రేణి మార్పిడి ప్రక్రియలకు తనను తాను ఎక్సలెన్స్ సెంటర్‌గా తీర్చిదిద్దుకుంది . ఆసుపత్రి యొక్క బహుళ విభాగ మార్పిడి బృందాలలో అత్యంత నైపుణ్యం కలిగిన సర్జన్లు, వైద్యులు, నర్సులు మరియు సహాయక సిబ్బంది ఉన్నారు, వారు సమగ్రమైన, రోగి-కేంద్రీకృత సంరక్షణను అందించడానికి అంకితభావంతో కృషి చేస్తున్నారు.

గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, కార్నియా, చిన్న ప్రేగు మరియు ఎముక మజ్జ మార్పిడితో సహా సమగ్ర మార్పిడి సేవలను అపోలో హాస్పిటల్స్  అందిస్తుంది. ప్రత్యేక పరికరాలు మరియు అధిక శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన మార్పిడి యూనిట్లు అవయవ మార్పిడి రోగులకు సరైన సంరక్షణను అందిస్తాయి. అన్ని వయస్సుల వ్యక్తుల యొక్క ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సంరక్షణతో , పెద్ద మరియు చిన్న వయసు  రోగులకు అవయవ మార్పిడిని నిర్వహిస్తారు,  రోగికి ఫలితాలను మెరుగుపరచడానికి మరియు కోలుకునే సమయాన్ని తగ్గించడానికి అపోలో హాస్పిటల్స్ కనిష్ట కోత  విధానాలతో సహా అత్యాధునిక శస్త్రచికిత్స పద్ధతులను ఉపయోగిస్తుంది. అధునాతన రోగనిరోధక శక్తిని తగ్గించే ప్రోటోకాల్‌లు అవయవ తిరస్కరణను నిరోధిస్తాయి మరియు దీర్ఘకాలం పాటు రోగికి మెరుగైన ఆరోగ్యంను  నిర్ధారిస్తాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్