Wednesday, February 4, 2026

విచారణ మధ్య నుంచే వెళ్లిపోయిన అరవ శ్రీధర్

- Advertisement -

విచారణ మధ్య నుంచే వెళ్లిపోయిన అరవ శ్రీధర్

కడప, మార్చి 3

విచారణ మధ్య నుంచే వెళ్లిపోయిన అరవ శ్రీధర్

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. జనసేన విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అరవ శ్రీధర్ మీద మహిళ ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు హాజరైన అరవ శ్రీధర్.. తన వివరణ తెలియజేశారు. అయితే సమావేశం మధ్యలోనే అరవ శ్రీధర్ బయటకు వచ్చినట్లు తెలిసింది. తన వివరణ, వివరాలు అన్నీ అందించానని.. పార్టీ అన్నీ చూసుకుంటుందంటూ అరవ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అరవ శ్రీధర్ మీద ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అరవ శ్రీధర్‌ను జనసేన అధిష్టానం ఆదేశించింది. వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బయటకు వచ్చేసినట్లు తెలిసింది. బయట విలేకర్లతో మాట్లాడుతూ.. తన వివరణ మొత్తం అధిష్టానానికి చెప్పినట్లు అరవ శ్రీధర్ తెలిపారు. అన్ని వివరాలు సమర్పించానని.. పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లోనూ అరవ శ్రీధర్ వ్యవహారం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం మీద డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందు హాజరై తన వివరణ తెలియజేశారు. ఈ వివరణ ఆధారంగా అరవ శ్రీధర్ విషయంలో జనసేన పార్టీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు అరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేసిన బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దంటూ ఈ వీడియోలో బాధితురాలు కోరారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించవద్దంటూ కోరారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని.. ఈ విషయంలో ఆయనకు ప్రమేయం లేదన్నారు. ఇదే సమయంలో అరవ శ్రీధర్ మీద మరికొన్ని ఆరోపణలు చేశారు. అధికారం, డబ్బుతో తనను లోబరుచుకోవాలని చూస్తున్నారని.. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. అరవ శ్రీధర్, తన ఫోన్లలోని డేటాను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరోవైపు అరవ శ్రీధర్ మద్దతుదారులు మాత్రం దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. ఆ మహిళ ఏదో ఆశించి అరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అరవ శ్రీధర్‌ను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్